తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జగన్ మంత్రివర్గం ఇదే! - new

ఏపీలో వైకాపా ప్రభుత్వం.. బీసీలకు పెద్దపీట వేసింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఏడుగురికి మంత్రివర్గంలో సీఎం జగన్ అవకాశం కల్పించారు.

jagan

By

Published : Jun 7, 2019, 9:15 PM IST

25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఏడుగురు బీసీలకు, ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం ఇవ్వగా వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3 కేటాయించారు. కాపు, రెడ్డి వర్గాలకు నాలుగుచొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

జగన్ మంత్రివర్గం ఇదే:

  1. ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
  2. బొత్స సత్యనారాయణ (విజయనగరం)
  3. పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
  4. అవంతి శ్రీనివాస్‌ (విశాఖ)
  5. కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
  6. పినిపె విశ్వరూప్‌ (తూర్పుగోదావరి)
  7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (తూర్పుగోదావరి)
  8. కొడాలి నాని (కృష్ణా)
  9. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (కృష్ణా)
  10. పేర్ని నాని (కృష్ణా జిల్లా)
  11. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
  12. మేకపాటి గౌతమ్‌ రెడ్డి (నెల్లూరు)
  13. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
  14. ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
  15. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
  16. తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
  17. మేకతోటి సుచరిత (గుంటూరు)
  18. మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
  19. ఆదిమూలపు సురేష్‌ (ప్రకాశం)
  20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
  21. గుమ్మనూరు జయరాం (కర్నూలు)
  22. నారాయణస్వామి (చిత్తూరు)
  23. అంజాద్‌ బాషా (కడప)
  24. శంకర్‌నారాయణ (అనంతపురం)
  25. అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు)

స్పీకర్​గా సీనియర్ నేత తమ్మినేని సీతారామ్​, బ్రాహ్మణ వర్గానికి చెందిన కోనరఘుపతిని డిప్యూటీ స్పీకర్​గా ఎన్నుకోనున్నారు.

ఇదీ చూడండి:"పార్టీ కోసం కాదు... ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం"

ABOUT THE AUTHOR

...view details