తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
'తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి'
"తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటున్నాను" చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం వారికి చేరువ కావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి : 'తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం'