తెరాస నేతల మౌనం కారణంగా పార్లమెంటులో ఐదేళ్లుగా మూగబోయిన ఆదిలాబాద్ జిల్లా వాణిని... ప్రజానాయకుడిగా తాను వినిపిస్తానని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రమేష్ రాఠోడ్ తెలిపారు. తన ప్రజాబలం ముందు తెరాస నేతల ధనబలం నిలవదని స్పష్టం చేశారు. ఎంపీగా గోడం నగేష్ చేసిందేమి లేకపోగా... కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో లేరని ధ్వజమెత్తారు. తాను లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ్డిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించేలా చూస్తానన్నారు రమేశ్ రాఠోడ్.
'తెరాసది ధన బలం... కాంగ్రెస్ది ప్రజాబలం'
"తెరాసది ధన బలం. కాంగ్రెస్ది ప్రజాబలం. నా బలం ముందు తెరాస నిలవదు. నేను ఎంపీగా ఎన్నికవడం ఖాయం. తమ్డిడిహెట్టి, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముందుగా ఆదిలాబాద్ జిల్లాకే నీరు అందిస్తా" -రమేశ్ రాఠోడ్
ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
Last Updated : Apr 8, 2019, 10:10 PM IST