తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2019, 11:08 AM IST

Updated : Oct 23, 2019, 7:01 PM IST

ETV Bharat / briefs

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరుల హతం

కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పజల్​పొర ప్రాంతంలో అఘాంతుకులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిపైకి కాల్పులు జరిపారు ముష్కరులు. ఉగ్రవాదుల చర్యలను భారత సైన్యం తిప్పికొట్టింది.

కశ్మీర్​లో ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ సంభవించింది. అనంత్​నాగ్​ జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని పజల్​పొర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు అధికారులు. వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాధానంగా బలగాలు దీటు సమాధానమిచ్చాయి.

హతమయిన ముష్కరులు స్థానికులేనని సమాచారం. వారిని గుర్తించి.. సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

కశ్మీర్​లో ఎదురుకాల్పులు

ఇదీ చూడండి: 'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్​'

Last Updated : Oct 23, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details