రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న రెండో విడత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 1,850 ఎంపీటీసీ, 179 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 218 ఎంపిటీసీల్లో 4 గంటలకే పూర్తైంది. మొదటి విడతతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఘర్షణలు జరగలేదు. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వారికి ఓటేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ముగిసిన రెండోవిడత స్థానిక పోలింగ్ - ముగిసిన పోలింగ్
స్థానిక సంస్థలకు రెండో విడత పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగియగా.. మిగిలిన స్థానాల్లో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

పోలింగ్ ముగిసింది