మాదకద్రవ్యాల కేసులో బంగాల్ భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) నాయకురాలి అరెస్టు కలకలం రేపింది. హూగ్లీ జిల్లా బీజేవైఎం కార్యదర్శి పమేలా గోస్వామితో పాటు.. ఆమె సహాయకుడు ప్రభీర్ కుమార్ను న్యూ అలీపూర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
''ఆమె గత కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటోందనే సమాచారం ఉంది. సరఫరాదారు ప్రభీర్తో కలసి డ్రగ్స్ అమ్మకందారులకు విక్రయించేందుకు వెళ్లిందనే విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నాం.''
-పోలీసులు
రూ.లక్షల విలువ..
పమేలా గోస్వామి బ్యాగ్ నుంచి లక్షల రూపాయల విలువ చేసే(100 గ్రాముల కొకైన్)ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఇవి వారి వద్దకు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. భాజపా ఎంపీలు సహా.. పైస్థాయి నేతలతో పమేలాకు మంచి సంబంధాలున్నాయి.