తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన ఐదు రోజులకే కరోనాతో మృతి - ఒడిశాలో పెళ్లైన ఐదు రోజులకే కరోనాతో వరుడు మృతి

పెళ్లైన ఐదు రోజులకే నూతన వరుడు కరోనాతో మరణించిన విషాద ఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

marriage
వధూవరులు

By

Published : May 16, 2021, 6:32 PM IST

కరోనా రెండో దశ ఎన్నో కుటుంబాలకు విషాదాన్ని మిగుల్చుతోంది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో వివాహం అయిన ఐదు రోజులకే నూతన వరుడు కొవిడ్​తో మరణించాడు. రాజ్ కానిక మండలం, దుర్గదేబిపాడా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ నాయక్.. బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మే 1న స్వగ్రామానికి వచ్చాడు.వచ్చే ముందే బెంగళూరులో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. కానీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. మే 9న అతని వివాహం జరిగింది.

అధిక స్నానం వల్లేనని..

ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వివాహం అనంతరం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కానీ పెళ్లిలో అధికంగా స్నానం చేయటం వల్ల అయి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావించారు. జ్వరం మాత్రలు వేసుకున్నా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకున్నా మే 12న శోభనం నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. అనంతరం అతని ఆరోగ్యం మరింత క్షీణించగా.. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అతని అరోగ్యం మరింత విషమించడం వల్ల భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే సంజయ్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి:'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details