తెలంగాణ

telangana

రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం

By

Published : Jan 23, 2021, 5:28 AM IST

ఎట్టకేలకు రామమందిర నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. రెండు నెలల క్రితం భూగర్భజల సమస్యతో ఆగిపోయిన ఆలయ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.

Ayodhya: Work restarts at Ram temple site
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం

రెండు నెలల క్రితం ఆగిపోయిన అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యలు డాక్టర్​ అనిల్​ మిశ్రా తెలిపారు. లార్సెన్​, టుబ్రో, టాటా కన్సల్​టింగ్ సంస్థ ఇంజనీర్​లతో చర్చించిన అనంతరం ఆలయ నమూనాకు తుది ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.

పూజ చేసి, ఆలయ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఆలయ స్థలంలో ఉన్న శిథిలాల్ని తొలగించడానకి 70 రోజులు పడుతుందని అన్నారు. పూజలో రామమందిర నిర్మాణ ప్యానెల్​ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రామమందిర పునాది తుది నమూనా సిద్ధం

ABOUT THE AUTHOR

...view details