బిహార్ భాగల్పుర్లోని సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని ఆదేశాలు జారీ చేసింది కాలేజ్ యాజమాన్యం. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్కోడ్ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అమ్మాయిలు లూజ్ హెయిర్తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. రామన్ సిన్హా తేల్చి చెప్పారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.