Women marriage age in India: మహిళల వివాహ వయసును 18 నుంచి 21 పెంచాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును సమీక్షించనున్న పార్లమెంటరీ ప్యానెల్లో ఒకేఒక్క మహిళా ఎంపీ ఉన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న ఈ బిల్లుపై సమీక్షించే ప్యానెల్లో 31 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 30 మంది పురుషులే కావటంటం గమనార్హం.
woman marriage age Parliament panel
రాజ్యసభ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధె... ఈ పార్లమెంట్ స్థాయీసంఘానికి అధ్యక్షత వహిస్తున్నారు. టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ ప్యానెల్లో ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు.
ప్యానెల్లో మరికొంతమంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని సుష్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Woman members in Parliament panel
ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను తరచుగా పార్లమెంట్లో ప్రస్తావించే సూలే.. ప్యానెల్లో మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదన్నారు. తద్వారా సంబంధిత ఈ సమస్యపై విస్తృత చర్చ జరిగేదని పేర్కొన్నారు. అవసరమైతే, ప్యానెల్కు నిపుణులను ఆహ్వానించే అధికారం ఛైర్మన్కు ఉందని, దానికనుగుణంగా పలువురు మహిళా ఎంపీలను పిలవాలని సూచించారు.