తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2022, 5:09 PM IST

ETV Bharat / bharat

లంచం ఇస్తేనే ఉద్యోగాలంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Priyank kharge news కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలని విమర్శించారు. యువతులైతే మరో రకంగా ప్రభుత్వానికి సహకరించాలని భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు ఎక్కుపెట్టింది. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని భాజపా పేర్కొంది.

priyank kharge statement
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే న్యూస్

Priyank kharge news 'కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలి' అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తనయుడైన ప్రియాంక్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా ఎదురుదాడికి దిగింది.

కలబురగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రియాంక ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని ప్రకటించుకున్న బొమ్మై- పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్గే అన్నారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలనూ తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని తాను 'లంచం- మంచం' ప్రభుత్వమని అనేందుకు సంకోచించనని వ్యాఖ్యానించారు. ఎస్సై నియామకాలకు నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలతో మూడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మగాళ్లు అయితే లంచం ఇవ్వాల్సి వస్తోందని, యువతుల అయితే మరో రకమైన ఒత్తిడి వస్తోందంటూ పేర్కొన్నారు. యువతతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టిన తనను సీఐడీ అధికారులతో నోటీసులు పంపించి బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు.

భాజపా రివర్స్‌ అటాక్‌..
ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు ఎక్కుపెట్టింది. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని భాజపా పేర్కొంది. కాంగ్రెస్‌ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన అనేక సీడీలు ఉన్నాయని తెలిపింది. భాజపా సర్కారుపై విమర్శలు చేసే ముందు ఆ జాబితాను బయటపెట్టండి అంటూ ఖర్గేను డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు దేశ మహిళలు ఎంతో కష్టపడుతున్నారని, అలాంటి వారిని అవమానించే రీతిలో ఖర్గే వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. వెంటనే మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది.

ఇవీ చదవండి:హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి

సతీమణితో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details