తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త మరణాన్ని తట్టుకోలేక.. చిన్నారిని చంపి భార్య ఆత్మహత్య.. ప్రయాణికుడిని రైలు నుంచి తోసేసిన జవాన్లు - ప్రయాణికుడిని రైలు నుంచి తోసేసిన జవాన్లు

భార్యతో గొడవ కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆయన భార్య.. ఏడాదిన్నర చిన్నారి చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, తోటి కోడలితో గొడవ కారణంగా ఓ గర్బిణీ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది.

Woman kills baby ends life
భర్త మరణాన్ని తట్టుకోలేక.. చిన్నారితో సహా భార్య ఆత్మహత్య

By

Published : Oct 22, 2022, 7:55 PM IST

కర్ణాటక బెళగావిలో విషాదకర ఘటన జరిగింది. భర్త మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ మహిళ తన ఏడాదిన్నర చిన్నారిని చంపి.. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతులను వంతమూరి గ్రామానికి చెందిన హోలెప్ప మారుతి(25), అతని భార్య వాసంతి (22), వారి ఏడాదిన్నర చిన్నారిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన ప్రకారం..
మారుతి మద్యం తాగి వచ్చి గురువారం రాత్రి తన భార్య వాసంతితో గొడవపడ్డాడు. కొపోద్రిక్తుడైన మారుతి ఆవేశంలో విషం తాగేశాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. భర్త మరణంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య వాసంతి.. తన ఏడాదిన్నర చిన్నారిని తీసుకుని ఊరికి దూరంగా ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడే తన చిన్నారి గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక ఆడుకోవడానికి బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో మిగిలింది.

రైలు నుంచి కిందకి తోసేసిన జవాన్లు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. నడుస్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడిని కిందకి తోసేశారు ఇద్దరు ఆర్​పీఎఫ్ జవాన్లు. ఈ ఘటనలో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఝార్ఖండ్​కు చెందిన అరుణ్ భుయాన్​గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని ఆర్​పీఎఫ్ అధికారులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు అరుణ్ తన సోదరుడు అర్జున్​తో కలిసి ముంబయి-హౌరా మెయిల్​ రైలులో బయలుదేరాడు. ఇద్దరు ఆర్​పీఎఫ్ జవాన్లు.. బాధితుడు అరుణ్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆర్​పీఎఫ్ సిబ్బంది, అరుణ్​ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన ఇద్దరు జవాన్లు.. అరుణ్​ను కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

బావిలో దూకిన గర్భిణీ..
కర్ణాటకలోని కలబురగిలో అమానవీయ ఘటన జరిగింది. తోటి కోడలితో గొడవ కారణంగా ఓ గర్బిణీ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది. ఈ ఘటనలో రేష్మా చవాన్​(26) అనే మహిళ మరణించగా.. ఆమె ఇద్దరు పిల్లలను స్థానికులు రక్షించారు. మృతురాలి భర్త మారుతి, మరిది సంతోశ్ కువైట్​లో ఉంటున్నారు. బాధితురాలు రేష్మ, కల్పన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు. తాజాగా అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రేష్మా.. తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకేసింది.

ఇవీ చదవండి:వెంటిలేటర్​ తీసేసి ఇంటికి వెళ్తానని పట్టుబట్టిన జయలలిత.. నివేదికలో విస్తుపోయే నిజాలు

'ఆ ఇద్దరు మాజీ మంత్రులు నన్ను లైంగికంగా వేధించారు'

ABOUT THE AUTHOR

...view details