తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పట్లో శత్రు విమానాలను హడలెత్తించి.. ఇప్పుడిలా విగతజీవిగా... - బిపిన్ రావత్ విమానం కూలిపోవడానికి కారణాలు ఏంటి?

Prithvi Singh Chauhan Pilot: యుద్ధవిమానాలను నడిపిన తమ కుమారుడు ఇక లేరన్న వార్తను ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులు.. ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

Prithvi Singh Chauhan
పృథ్వీ సింగ్ చౌహాన్

By

Published : Dec 9, 2021, 2:51 PM IST

Wing Commander Prithvi Singh Chauhan: తమిళనాడులోని కూనూర్​లో ప్రమాదానికి గురైన హెలికాప్టర్​ను నడిపిన పైలట్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 మందిలో పృథ్వీ ఒకరు. తన నైపుణ్యంతో శత్రువుల యుద్ధవిమానాలను బెంబేలెత్తించిన పృథ్వీ.. ఇలా ప్రమాదవశాత్తు మరణించరన్న విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కుటుంబంతో పృథ్వీ సెల్ఫీ

Bipin Rawat Helicopter Pilot: తమ కుమారుడు పృథ్వీ అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్ అని ఆయన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. సుడాన్​లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని చెప్పారు. అతని పోరాటపటిమను వాయుసేన ఉన్నతాధికారులు మెచ్చుకున్నారని వెల్లడించారు.

ఆర్మీ హెలికాప్టర్ వద్ద పృథ్వీ

"పృథ్వీపై మా ఒత్తిడి ఏం ఉండేది కాదు. మనసు ఏం చెబితే అది చేయాలని చెప్పేవాళ్లం."

-సురేంద్ర సింగ్ చౌహాన్, పృథ్వీ తండ్రి

బేకరీ యజమాని అయిన తండ్రి, గృహిణి అయిన తల్లికి జన్మించిన పృథ్వీ... తొలి పోస్టింగ్​లో హైదరాబాద్​లోనే పనిచేశారు. ఆ తర్వాత గోరఖ్​పుర్, గువాహటి, ఉధమ్​సింగ్ నగర్, జామ్​నగర్, అండమాన్ నికోబార్ సహా పలు ఎయిర్​ఫోర్స్ స్టేషన్​లలో పనిచేశారు. కుటుంబంలో ఏకైక మగ సంతానంగా జన్మించిన పృథ్వీకి తొలి నుంచీ ఆర్మీలో చేరాలనే తపన ఉండేదని ఆయన బంధువులు చెబుతున్నారు.

భార్య పిల్లలతో వింగ్ కమాండర్ పృథ్వీ

"యుక్త వయసు నుంచే ఆర్మీ పాఠశాలలో చేరాలని కలలు కనేవాడు. సెకండరీ స్కూలింగ్ అయిపోగానే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఎయిర్​ఫోర్స్​కు ఎంపికయ్యాడు."

-పృథ్వీ బంధువు

"పోస్టింగ్ తర్వాత వచ్చినప్పుడల్లా.. నన్ను ప్రోత్సహించేవాడు. సాయుధ దళాల్లో చేరాలని చెప్పేవాడు. 30 ఏళ్ల తర్వాత రక్షాబంధన్​కు ఇంటికి వచ్చాడు. అప్పుడు పిల్లలతో కలిసి ఆనందంగా గడిపాడు. ఒకట్రెండు నెలల క్రితమే కలిశాడు. అంతలోనే ఇలా జరిగింది."

-పృథ్వీ సన్నిహితుడు

చివరగా కోయంబత్తూరు ఎయిర్​ఫోర్స్ స్టేషన్​లో పృథ్వీ సేవలందించారు. 2007లో వివాహం చేసుకున్న పృథ్వీకి ఓ కూతురు, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details