తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త, కొడుకు అరెస్ట్​.. తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. భార్య మరణ వార్త విని గుండెపోటుతో.. - భర్త కొడుకు అరెస్టు మహిళల ఆత్మహత్య

Wife and Husband Died in Karnataka : కర్ణాటకలో విషాదకర ఘటన జరిగింది. భర్త, కొడుకు అరెస్ట్​ కావడాన్ని చూసి తట్టుకోలేని ఓ మహిళ.. ఆతహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్తను విని.. భర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు.

wife-and-husband-died-in-karnataka-woman-suicides-after-arrest-of-husband-and-son-husbannd-also-died-after-wife-suicides
మృతులు ఇంద్రాని, సామ్రాట్​

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 10:23 PM IST

Updated : Aug 22, 2023, 10:57 PM IST

Wife and Husband Died in Karnataka : హత్యకేసులో భర్త, కొడుకు అరెస్ట్​ కావడాన్ని తట్టుకోలేని ఓ మహిళ.. ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్తను విన్న భర్త కూడా.. జైలులోనే గండెపోటుతో కుప్పకూలాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఆదివారం చనిపోగా.. భర్త మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని మైసూర్​ జిల్లాలో జరిగిందీ విషాదం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మైసూర్​లోని విద్యానగర్​కు చెందిన బాల్​రాజ్​ అనే వ్యక్తి.. శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో మండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముండే తండ్రీకొడుకులైన తేజస్​, సామ్రాట్​ ఉన్నారు. ఈ కేసులో ముందు సామ్రాట్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పరారీలో ఉన్న బాల్​రాజ్​ స్నేహితులు.. సంజయ్​, కిరణ్​, తేజస్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వీరిని జైలుకు తరలించారు.

మృతులు ఇంద్రాని, సామ్రాట్​

కొడుకు, భర్త అరెస్ట్​ను తట్టుకోలేని 35 ఏళ్ల ఇంద్రాని.. ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణ వార్తను తెలుసుకున్న సామ్రాట్​ కూడా సోమవారం అర్థరాత్రి జైలులోనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన.. లాభం లేకుండా పోయింది. ఆస్పత్రి​లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు సామ్రాట్​.

భర్త గుండెపోటుతో మృతి.. చూసి తట్టుకోలేక భార్య కూడా..
కొద్ది రోజుల క్రితం భర్త మరణాన్ని భరించలేక భార్య కూడా మృతి చెందిన ఘటన తెలంగాణలోని జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. జిలచుక్క సారయ్య(55)కు ఇద్దరు భార్యలు. అతనికి మెుదటి భార్యకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరందరికి వివాహమైంది. పెద్ద కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. కొన్ని రోజులు గడిచిన తరవాత సారయ్య, కవిత(50)ను రెండో వివాహం చేసుకున్నాడు. అతను రెండో వివాహం చేసుకోవడం వలన మెుదటి భార్యతో నిత్యం గొడవలు అవుతుండేవి. దీంతో మెుదటి భార్య, పిల్లలు వారిని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి అతడు, తన రెండో భార్యతో కలిసి మోరంచపల్లిలో నివాసం ఉన్నారు. అయితే అర్ధరాత్రి సారయ్య గుండెపోటుతో మరణించాడు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

'భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు భర్తకు సెలవులు.. చట్టం చేయాల్సిందే'.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

షూ వేసుకుని ఐసీయూలోకి వెళ్లిన మేయర్​.. అడ్డుచెప్పిన ఆస్పత్రి స్టాఫ్​.. ఆగ్రహంతో బుల్డోజర్​ను పిలిపించి..​

Last Updated : Aug 22, 2023, 10:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details