తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 7:50 AM IST

Updated : Mar 22, 2021, 9:14 AM IST

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్​ సింగ్​ రావత్​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది లాక్​డౌన్​లో రేషన్​ పంపిణీ చేసిన సమయంలో ఎక్కువ మంది పిల్లలు ఉండి ఉంటే ఎక్కువ రేషన్​ వచ్చేదని అన్నారు. 10, 20 మంది పిల్లలు ఉన్నవారు రేషన్​ పంపిణీతో లబ్ధిపొందారని పేర్కొన్నారు.

rawat
'ఎక్కవ మంది పిల్లలు ఉంటే ఎక్కువ రేషన్​ వచ్చేది'

ప్రమాణస్వీకారం చేపట్టిన దగ్గర నుంచి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్​ సింగ్​ రావత్​ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రేషన్​ లబ్ధిదారులను ఉద్దేశిస్తూ.. 'మీరు ఎక్కువ మంది పిల్లల్ని కని ఉంటే ఇంకా ఎక్కువ రేషన్​ వచ్చేది కదా' అని వ్యాఖ్యానించారు. నైనిటాల్​లోని రామ్​నగర్​లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"గతేడాది లాక్​డౌన్​ సమయంలో ప్రతి ఒక్కరికీ 5 కేజీల చొప్పన రేషన్​ పంపిణీ చేశాం. పది మంది పిల్లలు ఉన్న వారికి 50 కేజీలు, 20 మంది ఉన్న వారికి క్వింటాల్ రేషన్​ వచ్చింది. అందులో వారు కొంత అమ్ముకొని లబ్ధిపొందారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి మాత్రం 10 కేజీలే వచ్చింది. మీకు కూడా 20 మంది పిల్లలు ఉండి ఉంటే లబ్ధిపొందేవారు. ఎందుకు కనలేదు? అంత మంచి నాణ్యత గల బియ్యాన్ని నేను ఎప్పుడూ తినలేదు.'

-తీరథ్ సింగ్​ రావత్​, ఉత్తరాఖండ్​ సీఎం

అంతకు ముందు అమెరికా 200 ఏళ్ల పాటుమన దేశాన్ని పాలించిందని మాట్లాడి విమర్శలకు పాలయ్యారు తీరథ్​ సింగ్. ఆ దేశం ఇప్పుడు కొవిడ్ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. అంతకుముందు కూడా మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు తీరథ్.

ఇదీ చదవండి :'జల్​ శక్తి అభియాన్​: క్యాచ్​ ది రైన్​'కు నేడు మోదీ శ్రీకారం

Last Updated : Mar 22, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details