వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ.. దేశంలోని ఐటీ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కేంద్రం, ఫేస్బుక్, వాట్సాప్కు నోటీసులు జారీ చేసింది.
తమ ప్రైవసీ పాలసీ మే15 నుంచి అమల్లోకి వచ్చిందని వాట్సాప్.. హైకోర్టు ధర్మాసనానికి వివరించింది. ఈ నూతన పాలసీని అంగీకరించని వారి ఖాతాలను తొలగించమని, మునుపటి లాగే వాట్సాప్ సేవలు కొనసాగుతాయని కోర్టుకు తెలిపింది.
ఒకేలా చూడట్లేదు..
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. భారత ఐటీ చట్టానికి పూర్తిగా విరుద్ధమని, ఇదే విషయంపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్కు లేఖ రాశామని.. కానీ ఇంకా వారి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు వివరించింది.