కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో బంగాల్లో సంపూర్ణ లాక్డౌన్ను విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం నుంచి అమలులోకి వచ్చే ఈ లాక్డౌన్ ఈనెల 30 వరకు కొసాగుతుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, బస్సులు, మెట్రో రైళ్లు, సబ్అర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
బంగాల్లో 16వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ - బంగాల్లో కరోనా మహమ్మారి
బంగాల్లో సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే 16 నుంచి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

బంగాల్లో లాక్డౌన్
ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ విధించగా, మరికొన్ని పాక్షికంగా ఆంక్షలను విధించారు.
ఇదీ చదవండి :కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి