తెలంగాణ

telangana

మమతపై యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

By

Published : Jan 17, 2021, 10:39 PM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ మంత్రి ఆనంద్​ స్వరూప్​. వచ్చే ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

West Bengal CM Mamata Banerjee Islamic terrorist: UP minister
దీదీ.. ఓ ఇస్లామిక్​ ఉగ్రవాది: యూపీ మంత్రి

బంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి ఆనంద్‌ స్వరూప్‌ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'దీదీ ఇస్లామిక్ ఉగ్రవాది. ఆమె.. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో శరణార్థిగా జీవించాల్సి వస్తుంది. భారతీయతను, హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచేలా దీదీ వ్యవహరిస్తున్నారు.' అని పేర్కొన్నారు ఆనంద్ స్వరూప్. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి:బంగాల్​ ఎన్నికల బరిలో శివసేన

ABOUT THE AUTHOR

...view details