తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2022, 11:35 AM IST

ETV Bharat / bharat

'దాగుడుమూతలు' ఆడుతూ బాలుడు మాయం.. ఏడాది తర్వాత ఫేస్​బుక్​ సాయంతో..

స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటూ ఓ బాలుడు.. అనుకోకుండా రైలు ఎక్కాడు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ పిల్లాడు.. ఆ రైలులోనే ఏడాది క్రితం బెంగళూరు చేరుకున్నాడు. 15 రోజుల క్రితం ఆ బాలుడ్ని గుర్తించిన కొందరు బెంగళూరు యువకులు ఆరా తీశారు. ఫేస్​బుక్​ ద్వారా తన సోదరుడ్ని సంప్రదించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పట్టిరాని సంతోషంతో ఆ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.

After year west bengal boy reached his Moth
After year west bengal boy reached his Moth

ఏడాది క్రితం తప్పిపోయిన ఓ బాలుడ్నిఫేస్​బుక్​ మెసెంజర్​ సహాయంతో తల్లిదండ్రులు చెంతకు చేర్చారు కొందరు బెంగళూరు యువకులు. దీంతో తమ కన్నబిడ్డను ఏడాది తర్వాత చూసిన తల్లిదండ్రులు పిల్లాడిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ యువకులకు జీవితాంతం రుణపడి ఉంటామని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.

తల్లిదండ్రులతో బాలుడు

అసలేం జరిగిందంటే?..బంగాల్​కు చెందిన సుహాస్​ అనే బాలుడు.. ఏడాది క్రితం తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటూ రైలు ఎక్కాడు. ఆ తర్వాత రైలు కదలింది. ఏం చేయాలో తెలియని ఆ పిల్లవాడు ఆ రైలులోనే బెంగళూరు స్టేషన్​కు చేరుకున్నాడు.

15 రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఓ బేకరీ ముందు ఆకలితో అలమటిస్తూ కూర్చున్నాడు. బాలుడ్ని బేకరీ యజమాని రాజన్న, నితిన్​, శ్రీధర్​ గమనించారు. వివరాలు ఆరా తీయగా పిల్లవాడు తనకేం గుర్తులేవని హిందీలో చెప్పాడు. అతడి అన్నయ్య పేరు మాత్రమే చెప్పాడు. వెంటనే ఫేస్​బుక్​ మెసెంజర్​ ద్వారా ఆ పేరును సెర్చ్​ చేసి ఫొటోను చూపించారు. బాలుడు.. తన అన్నయ్యను గుర్తుపట్టాడు. వెంటనే ఆ యువకులు సుహాస్​ సోదరుడ్ని సంప్రదించారు. వచ్చి తన తమ్ముడ్ని తీసుకెళ్లమని చెప్పారు.

తలిదండ్రుల వద్దకు చేరిన బాలుడు
హెయిర్​ కటింగ్ చేయిస్తున్న యువకులు

ఆ తర్వాత సుహాస్​కు ఆ యువకులు బేకరీలో పడుకోవడానికి గది, ఆహారం ఏర్పాటు చేశారు. హెయిర్​ కట్​ కూడా చేయించారు. అతడి తల్లిదండ్రులు వచ్చేవరకు సొంత తమ్ముడిలా చూసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సుహాస్​ తల్లిదండ్రులు బెంగళూరు వచ్చారు. పిల్లాడిని చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తమతో పాటు బంగాల్​ తీసుకెళ్లారు. ఈ విషయమంతా తెలుసుకున్న ప్రజలు.. రాజన్న, నితిన్​, శ్రీధర్​ను ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి:దేశంలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 12వేల దిగువకు కేసులు

ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

ABOUT THE AUTHOR

...view details