తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 6:53 PM IST

Updated : Jun 8, 2021, 12:15 PM IST

ETV Bharat / bharat

భాజపా కార్యకర్త తల్లి మృతిపై రాజకీయ దుమారం

గత నెలలో.. బంగాల్​లో టీఎంసీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన భాజపా కార్యకర్త తల్లి సోమవారం ప్రాణాలు విడిచారు. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ఆ తల్లి మరణం.. మమతను వెంటాడుతుందని అమిత్​ షా ట్వీట్​ చేయగా.. హాథ్రస్​ మహిళల బాధపై ఎందుకు స్పందించడం లేదని షాను మమత ప్రశ్నించారు.

BJP worker's mother died after allegedly beaten by Tmc wokers in Nimta
భాజపా కార్యకర్త తల్లి మరణంపై రాజకీయ దుమారం

బంగాల్​లో భాజపా కార్యకర్త తల్లి మరణంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఎంసీపై భాజపా తీవ్ర ఆరోపణలు చేయగా.. వాటిని సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు.

నిమ్తాలోని భాజపా కార్యకర్త గోపాల్​ మజుమ్​దార్​ తల్లి శోభను గత నెలలో ఆసుపత్రిలో చేర్చారు. 85ఏళ్ల తన తల్లిపై ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని గోపాల్​ పేర్కొన్నాడు. దాడి జరిగిన కొద్దిసేపటికి భాజపా నేత సువేందు అధికారి.. గోపాల్​ నివాసానికి వెళ్లారు. శోభను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం.. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి చేరారు. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఆ వృద్ధురాలు ప్రాణాలు విడిచారు.

'మమతను వెంటాడుతుంది..'

గోపాల్​ తల్లి మరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పందించారు. ఆ తల్లి మరణం.. మమతను వెంటాడుతుందని మండిపడ్డారు.

"శోభాజీ మరణ వార్తను విని తీవ్ర వేదనకు గురయ్యాను. టీఎంసీ గూండాలు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆ నొప్పి, ఆమె కుటుంబసభ్యుల బాధ.. మమతను వెంటాడతాయి. బంగాల్​లో అహింస కోసం భాజపా పోరాడుతుంది. బంగాల్​ తల్లులు, సోదరీమణుల భద్రత కోసం భాజపా పోరాడుతుంది."

--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

'హాథ్రస్​ మాటేంటి?'

అమిత్​ షా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మమతా బెనర్జీ. మహిళలపై హింసను తాను సహించబోనని తేల్చిచెప్పారు. భాజపా పాలిత ఉత్తర్​ప్రదేశ్​లో.. మహిళలు హింసకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని, అమిత్​ షా వారిని ఎందుకు పట్టించుకోరాని ప్రశ్నించారు.

"ఆ సోదరి(గోపాల్​ తల్లి) ఎలా మరణించారో నాకు తెలియదు. మహిళలపై హింసకు మేము మద్దతివ్వము. ఈ విషయంపై భాజపా రాజకీయాలు చేస్తోంది. బంగాల్​ పరిస్థితి ఏంటని అమిత్​ షా ట్వీట్లు చేస్తున్నారు. మరి ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో మహిళలపై జరిగిన పైశాచిక దాడిపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటారు?"

--- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి:-మమతXసువేందు: నందిగ్రామ్​లో మాటల తూటాలు

Last Updated : Jun 8, 2021, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details