తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ

ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ గుజరాత్​ పర్యటనలో భాగంగా సూరత్​ చేరుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీటీపీతో పొత్తు కుదుర్చుకుని బరిలో దిగిన ఓవైసీ.. ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకునేందుకే తాను రాష్ట్రానికి వచ్చానని వ్యాఖ్యానించారు ఓవైసీ.

By

Published : Feb 7, 2021, 6:04 AM IST

We are here to win the hearts of the people of Gujarat: Owaisi
గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ

ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ దూకుడు పెంచారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు దక్కించుకున్న తరుణంలో ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న బంగాల్​ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా.. గుజరాత్​పైనా పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టారు. గుజరాత్​ స్థానిక ఎన్నికల్లో భారతీయ ట్రైబల్​ పార్టీతో పొత్తు కుదుర్చుకుని బరిలో దిగనున్నారు.

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా శనివారం గుజరాత్​లోని సూరత్​ చేరుకున్నారు ఓవైసీ. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకునేందుకే తాను అహ్మదాబాద్​కు వచ్చానని వ్యాఖ్యానించారు.

"గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకునేందుకే నేను ఇక్కడి వచ్చాను. అందుకోసం మా పార్టీ నిరంతరం శ్రమిస్తుంది. అయితే.. భాజపాపై గెలిచేందుకే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటిల్లో నిజం లేదు. నేను భారత రాజకీయాలకు అభిమానిని. పోటీ చేసే హక్కు అందరికీ ఉంది."

-- అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత.

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆదివారం బరూచ్​, అహ్మదాబాద్​లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఓవైసీ.

అయితే గుజరాత్​కు తమ పార్టీ కొత్త అని.. అందుకే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయలేమని అభిప్రాయపడ్డారు ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత. ఈ విషయంపై బీటీపీతో చర్చించి పొత్తు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:-బంగాల్​ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను?

ABOUT THE AUTHOR

...view details