తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 10:50 AM IST

ETV Bharat / bharat

గుజరాత్​లో ప్రశాంతంగా పోలింగ్​

గుజరాత్​లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Voting underway for local bodies polls in Gujarat
గుజరాత్​లో ప్రశాంతంగా 'స్థానిక పోరు'

గుజరాత్​లో స్థానిక పోరు జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

కేంద్ర పంచాయతీ రాజ్​, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్​ రూపాలా.. అమ్రేలీ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జుగల్జీ ఠాకూర్​.. మెహ్సానాలో ఓటు వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,474 స్థానాలకు గానూ.. 36వేల పోలింగ్​ బూత్​ల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3.04 కోట్ల మంది ఓటర్లు ఇందులో పాలొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 44 వేల మంది పోలీసు సిబ్బంది సహా.. 12 సీఏపీఎఫ్​ కంపెనీలు, 54,000 మంది హోంగార్డులు.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి:గుజరాత్​ స్థానిక సమరం: ఓటు వేయనున్న 3.4 కోట్ల మంది

ABOUT THE AUTHOR

...view details