ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్లో వింత ఘటన చోటుచేసుకుంది. టీకా వేయించుకోవడానికి నిరాకరించినందున తమ గ్రామానికి విద్యుత్ నిలిపివేశారని సౌరిఖ్ గ్రామస్థులు ఆరోపించారు.
"ప్రజలకు టీకా వేయించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ బుధావారం గ్రామానికి వచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏ ఇబ్బంది లేదు. అందుకు తిరస్కరించినవారికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకా తీసుకోనివారి ఇళ్లకు విద్యుత్ నిలిపివేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు," అని సురేశ్ దుబే అనే గ్రామస్థుడు తెలిపారు.