తెలంగాణ

telangana

'మాధవపురం'గా మారిన మహ్మద్​పుర్​.. ఆప్​, భాజపా మాటల యుద్ధం

Village name change in Delhi: దిల్లీలో గ్రామాల పేర్ల మార్పుపై భాజపా దూకుడుగా వ్యవహరిస్తోంది. 40 గ్రామాల పేర్లు మారుస్తామని ప్రకటించిన వారం రోజుల్లోనే దక్షిణ దిల్లీలోని మహ్మ​పుర్​ గ్రామం పేరును మాధవ​పురంగా మార్చింది. ఈ మేరకు ట్వీట్​ చేశారు దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్​ గుప్తా. మరోవైపు.. గతవారం భాజపా చేసిన ప్రకటనను అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ ఖండించింది.

By

Published : Apr 27, 2022, 5:54 PM IST

Published : Apr 27, 2022, 5:54 PM IST

RENAMING
మాధవపురమ్​గా పేరు మార్పు

Village name change in Delhi: దక్షిణ దిల్లీలోని మహ్మద్​పుర్​ గ్రామం పేరును మాధవపురంగా మార్చినట్లు భాజపా నేతలు బుధవారం ప్రకటించారు. బానిసత్వపు గుర్తులు తమతో ఉండకూడదని గ్రామస్థులు కోరుకుంటున్నారని, అందుకే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా మాధవ​పురం​గా మార్చిన గ్రామ నామఫలకం వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్​ గుప్తా. ఆ ఫొటోలను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

ఇటువంటి విషయాలన్నింటికి దిల్లీకి 'స్టేట్​ నేమింగ్​ అథారిటీ' ఉందని, అలాంటి ప్రతిపాదనలు వస్తే.. దానిని సమీక్షించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్​ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే గ్రామానికి భాజపా నేతృత్వంలో పేరు మార్చటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"పేరు మార్చాలన్న ప్రతిపాదనకు మున్సిపల్​ కార్పొరేషన్​ ఆమోదం తెలిపిన క్రమంలో.. మాధవపురం​గా పేరు మార్చే ప్రక్రియ ఈ రోజు పూర్తయింది. ఇప్పటి నుంచి ఈ గ్రామం పేరు మహ్మద్​​పుర్​ కాదు మాధవ​పురం​. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న క్రమంలో బానిసత్వానికి సంబంధించిన గుర్తులు తమతో ఉండాలని దిల్లీ వాసులు కోరుకోవటం లేదు. భాజపా కౌన్సిలర్​ ప్రతిపాదనను స్థానికులు, భాజపా కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతిపాదనకు దక్షిణ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆమోదం తెలిపింది. మాధవ​పురంగా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపి.. గత ఏడాది డిసెంబర్​లో దిల్లీ ప్రభుత్వానికి పంపించగా.. ఆరు నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు."

- అదేశ్​ గుప్తా, దిల్లీ భాజపా అధ్యక్షుడు.

బానిసత్వానికి గుర్తులుగా ఉన్న 40 గ్రామాల పేర్లు మార్చేందుకు ప్రతిపాదనలను కేజ్రీవాల్​ ప్రభుత్వానికి పంపుతామని దిల్లీ భాజపా గత వారం తెలిపింది. అందులో హుమయున్​పుర్​, యూసఫ్​ సరాయ్​, మసూద్​పుర్​, జమ్​రూద్​పుర్​, బెగమ్​పుర్​, సైదుల్​ అజాబ్​, ఫతేపుర్​ బేరి, హౌజ్​ ఖాస్​, షేక్​ సరాయ్​ వంటివి ఉన్నాయి. మరోవైపు.. భాజపాపై విమర్శలు గుప్పించింది ఆమ్​ ఆద్మీ పార్టీ. నింబధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవటం భాజపాకు ఇష్టం లేదని, అల్లర్లు సృష్టించేందుకు అవకాశాలను వాడుకుంటోందని ఆరోపించింది.

6వేల లౌడ్​స్పీకర్ల తొలగింపు:మరోవైపు..ఉత్తర్​ప్రదేశ్​లోని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6వేల లౌడ్​స్పీకర్లను తొలగించామని, మరో 30వేల స్పీకర్ల సౌండ్​ను అనుమతించదగిన పరిమితుల్లో తగ్గించినట్లు సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. శాంతిభద్రతల అంశంపై గత వారం సీనియర్​ అధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమావేశమైన అనంతరం ఈ ప్రక్రియ మొదలైంది. లౌడ్​స్పీకర్లు తొలగించినా.. మైక్రోఫోన్స్​ ఉపయోగించుకోవచ్చని, అయితే, వాటి శబ్దం పరిధి దాటకూడదన్నారు అధికారి. దాని ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదిక కోరినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. లక్కీగా..

మే 2 నుంచి మోదీ ఫారిన్ టూర్- 3 దేశాల్లో సుడిగాలి పర్యటన

ABOUT THE AUTHOR

...view details