తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vikas Swami Yoga : పళ్లతో బరువులెత్తి తండ్రీకొడుకుల రికార్డులు.. గిన్నిస్​లోనూ చోటు.. కానీ తిండికిలేని పరిస్థితిలో.. - vikas swami financial situation

Vikas Swami Yoga : తమ పళ్లతో బరువులెత్తి ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన వారు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పేదరికంతో పూట గడవటమే గగనమవుతోంది. తమ కళకు మెరుగులు దిద్ది ప్రేక్షకులను అలరించాల్సిన వారు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అరుదైన కళ ఉన్న తండ్రీకొడుకులు దీనగాథ ఇది.

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 5:50 PM IST

Updated : Aug 26, 2023, 8:12 PM IST

పళ్లతో బరువులెత్తి తండ్రీకొడుకుల రికార్డులు

Vikas Swami Yoga : అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించారు. వారి నైపుణ్యంతో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలకపై తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కానీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారే ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చెందిన తండ్రీకొడుకులు.

కుమారులతో వికాస్ స్వామి

మేరఠ్​ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నావాల్​ గ్రామానికి చెందిన వికాస్​ స్వామి (38)కి ఇద్దరు కుమారులు. వికాస్​కు 2010లో యాక్సిడెంట్​ అవ్వడం వల్ల మంచం పట్టాడు. వైద్యులు కూడా ఏమీ చేయలేని చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలో యోగా సాధన చేయమని సన్నిహితుడు ఒకరు సలహా ఇచ్చారు. అనంతరం ఇంట్లోనే యోగా సాధన ప్రారంభించాడు వికాస్​. అయితే కేవలం యోగానే కాకుండా విభిన్నంగా ఏమైనా చేయాలనుకున్నాడు. అలా పళ్లతో బరువులు ఎత్తడం సాధన చేశాడు. కొద్ది కాలంలోనే పళ్లతో బరువులు ఎత్తడంలో ప్రావీణ్యం సంపాదించాడు.

వికాస్​ స్వామి కుమారుల విన్యాసాలు

2021లో వికాస్​ స్వామి తన పళ్లతో 80 కిలోల బరువును ఎత్తి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, యోగా ప్రపంచ రికార్డు సాధించాడు. 'ఇండియాస్​ గాట్​ టాలెంట్​' అనే టీవీ షోలో అద్భుత ప్రదర్శన చేసి గిన్నిస్​ బుక్ వరల్డ్ రికార్డ్స్​​లో కూడా తన పేరును లిఖించుకున్నాడు. రికార్డులతో పాటు పలు పతకాలను అందుకున్నాడు. అలా ఈ కళలో మార్పులు చేస్తూ.. తలకిందులుగా చేతులపై నిలబడి పళ్లతో బరువులు ఎత్తడం మొదలుపెట్టాడు.

తండ్రిని చూసి వికాస్ ఇద్దరు కుమారులు ఆదిత్య, అన్మోల్​ కూడా అలానే చేయడం మొదలుపెట్టారు. వారు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించారు. ఆదిత్య 13 ఏళ్ల వయసులో పళ్లతో 75 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యోగా వరల్డ్ రికార్డ్స్​లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అన్మోల్​ 9 ఏళ్ల వయసులో 45 కిలోల బరువెత్తి ఇండియా, ఆసియా, యోగా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లోనూ చోటు సంపాదించుకున్నాడు.

అయితే.. వికాస్ కుమారులు గిన్నిస్ రికార్డ్స్​లో చోటు సంపాదించినా వారి కష్టాలు తీరలేదు. వికాస్​ అప్పుడప్పుడు ప్రదర్శనలు, స్నేహితులు ఇచ్చే డబ్బులతో పిల్లల ఆకలి తీర్చేవారు. కానీ.. తన​ పిల్లల నైపుణ్యాలను పెంచడానికి, వారికి మంచి భవిష్యత్​ను​ అందించడానికి ప్రస్తుతం వికాస్ వద్ద డబ్బులేదు. తాను ఆర్థిక ఇంబ్బందుల నుంచి గట్టెక్కెలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సాయం చేయాలని కోరుతున్నారు వికాస్. పేదరికం నుంచి బయటపడేలా ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని సీఎంను అభ్యర్థిస్తున్నారు.

కుమారులతో వికాస్ స్వామి

వెయిట్​ లిఫ్టింగ్​లో 8ఏళ్ల చిన్నారి భళా​.. 62 కేజీల బరువెత్తి.. గిన్నిస్​ రికార్డ్​ బద్దలు కొట్టిన 'అశ్రియా'..

పేక ముక్కలతో మ్యాజిక్! నిమిషంలో 18 కార్డులను పుచ్చకాయలో దించి రికార్డు.. 'గిన్నిస్' దాసోహం

Last Updated : Aug 26, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details