తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేతల వారసులను ఓటర్లు ఆదరించారా? - laluprasad yadav

ఈ ఏడాది బిహార్​ ఎన్నికల్లో బరిలోకి దిగిన వారిలో యువతరం అధికంగా కనిపించింది. దిగ్గజ నేతల వారసులు పోటీలో నిలవటం వల్ల ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించిన వీరంతా.. రాజకీయ రణరంగంలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో కొందరు గెలుపు రుచి చూస్తే.. మరికొందరిని ఓటర్లు బోల్తా కొట్టించారు.

Victory of leaders' successors in Bihar elections
నేతల వారసులను ఓటర్లు ఆదరించారా?

By

Published : Nov 11, 2020, 7:00 AM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎందరో వారసులు బరిలో దిగారు. తమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వీరంతా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో దిగ్గజ నేతలు మొదలుకొని గతంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకుల వారసులూ ఉన్నారు. మరి విజయం ఎవరిని వరించిందంటే...?

ఆర్​జేడీ:

  • మహాకూటమి సీఎం అభ్యర్థి, లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్​ రాఘోపుర్​లో విజయఢంకా మోగించారు. భాజపా అభ్యర్థి సతీశ్​ కుమార్​పై 38 వేలఓట్లకుపైగా మెజార్టీ సాధించారు.
    తేజస్వీ యాదవ్​
  • మహువా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తేజస్వీ అన్న తేజ్​ ప్రతాప్ యాదవ్ హసన్​పుర్ నుంచి గెలుపొందారు.
    తేజ్​ ప్రతాప్​ యాదవ్​
  • పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద్​ తివారీ కుమారుడు రాహుల్​ తివారీ(షాపుర్​)- గెలుపు
  • పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జగదానంద్​ సింగ్​ తనయుడు సుధాకర్​ సింగ్​(రాంగఢ్​)- గెలుపు
  • కేంద్ర మాజీ మంత్రి కాంతి సింగ్‌ కుమారుడు రుషీ సింగ్(ఓబ్రా)- గెలుపు

భాజపా:

  • కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్​ నారాయణ్​ యాదవ్​ సోదరుడు విజయ్​ప్రకాశ్​పై పోటీ చేసిన ప్రముఖ కామన్వెల్త్​ క్రీడాకారిణి శ్రేయసి సింగ్​(జముయీ) విజయం సాధించారు. ఈమె కేంద్ర మాజీ మంత్రి, దివంగత దిగ్విజయ్​ సింగ్​ కుమార్తె.
  • మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నవీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా కుమారుడు నితిన్‌ నవీన్‌(బంకీపోరె) గెలిచారు.

జేడీయూ:

  • రాష్ట్ర మాజీ మంత్రి, దివంగత కపిల్‌దేవ్‌ కామత్‌ కోడలు మీనా కామత్‌(బాబూబర్హీ) నుంచి గెలిచారు.
  • హరియాణా గవర్నర్‌ సత్య నారాయణ్‌ ఆర్య కుమారుడు కౌశల్‌ కిశోర్‌(రాజ్​గిర్​) సత్తా చాటారు.

కాంగ్రెస్​:

  • శతృఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హా(బంకీపోరె) పరాజయం చెందారు.
    లవ్​ సిన్హా

జేడీయూ నేత వినోద్ చౌధరీ కూతురు పుష్పమ్ ప్రియా చౌధరీ(బంకిపోరె).. ప్లూరల్స్ పార్టీని స్థాపించి బిహార్​ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. బిహార్​లో భారీ మార్పులు రావాలంటూ గళమెత్తి.. సీఎం నితీశ్​ కుమార్​కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా గెలవలేకపోయారు. ఇక్కడ భాజపా అభ్యర్థి(నవీన్​) గెలిచారు.

ABOUT THE AUTHOR

...view details