తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్‌ సరఫరా: జీపీఎస్​తో వాహనాల ట్రాకింగ్‌! - oxygen containers

కరోనాతో ఆక్సిజన్​ కొరత వెంటాడుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ సరఫరా చేసే అన్ని రకాల వాహనాలను జీపీఎస్‌తో ట్రాకింగ్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని వాహనాలకు వీఎల్‌టీ పరికరాన్ని అమర్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ.

GPS tracking oxygen containers
ఆక్సిజన్​ సరఫరా వాహనాలు

By

Published : May 4, 2021, 8:09 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ఆస్పత్రులను ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. పలుచోట్ల ఆక్సిజన్‌ను నల్లబజారులో విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ సరఫరా చేసే అన్ని రకాల వాహనాలను జీపీఎస్‌తో ట్రాకింగ్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని వాహనాలకు వీఎల్‌టీ పరికరాన్ని అమర్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.

ఆక్సిజన్ సరఫరా వాహనాలకు జీపీఎస్​ ట్రాకింగ్​

'ఆక్సిజన్‌ కంటైనర్లు/ట్యాంకర్లు/వాహనాలకు తప్పనిసరిగా వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌(వీఎల్‌టీ) పరికరాన్ని అమర్చడం తప్పనిసరి' అని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. సరఫరాలో ఆలస్యం, దారిమళ్లించడం వంటి వాటిని నిరోధించడంతో పాటు ట్యాంకర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ జీపీఎస్‌ ట్రాకింగ్‌ వినియోగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఇక దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న పలు రాష్ట్రాల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా ఆక్సిజన్‌ జనరేటర్లు, కంటైనర్లు, సిలిండర్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో యుద్ధవిమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో ఆక్సిజన్‌ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ట్యాంకర్లు/వాహనాలను జీపీఎస్‌ ద్వారా ట్రాకింగ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చూడండి:'నందిగ్రామ్ రిటర్నింగ్​ అధికారికి పూర్తి భద్రత'

ABOUT THE AUTHOR

...view details