తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2022, 1:37 PM IST

ETV Bharat / bharat

'ప్రభుత్వ' కార్యక్రమాలపై ప్రచారం.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం

Youth bags World Book of Records: ఉత్తరాఖండ్​ హల్ద్వానికి చెందిన వైభవ్​ పాండే అరుదైన ఘనత సాధించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 65 కార్యక్రమాలను ఒకే రోజులో వందల మంది తెలిసేలా ప్రచారం చేసి.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్సులో స్థానం సంపాదించాడు.

vaibhav pandey Haldwani
vaibhav pandey Haldwani

Youth bags World Book of Records: ఉత్తరాఖండ్​ హల్ద్వానికి చెందిన వైభవ్​ పాండే వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.. ఒకే రోజులో ఎనిమిది కేంద్రాల్లో వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు చూసి ముగ్ధుడైన వైభవ్​ పాండే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలపై అధ్యయనం చేశాడు. వీటితో పొందే లబ్ధిని సామాన్య ప్రజలకు వివరించాలని నిర్ణయించాడు.

ఆరు ప్రైవేట్​ పాఠశాలలతో సహా ఎనిమిది కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాడు వైభవ్ పాండే. అతడు​ ప్రచారం చేసిన 65 కార్యక్రమాల్లో పరీక్షా పే చర్చా, మన్​ కీ బాత్​, మేక్​ ఇన్​ ఇండియా, స్కిల్​ ఇండియా, డిజిటల్​ ఇండియా ఉన్నాయి. డ్రైవర్లు, పాఠశాల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని వివరించాడు. దీంతో పాటు వోకల్​ ఫర్​ లోకల్​ స్ఫూర్తితో నగర ప్రజల కోసం వర్చువల్​ సెషన్​ను నిర్వహించాడు.

ఇదీ చదవండి:గుజరాత్​లో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details