తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2021, 9:44 AM IST

ETV Bharat / bharat

ఘనంగా కుంభమేళా- భక్తుల పుణ్యస్నానాలు

హరిద్వార్​లో కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేశారు అధికారులు.

Devotees take holy dip at the Har Ki Pauri ghat in Haridwar as Kumbh Mela begins today
హరిద్వార్​లో ఘనంగా కుంభమేళా ప్రారంభం

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో కుంభమేళా ప్రారంభమైంది. హర్​ కీ పౌడీ ఘాట్​ వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు.

ఈ నేపథ్యంలో.. ఐటీబీపీ, సీఏపీఎఫ్​ సహా ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కుంభమేళాలో పాల్గొన్న భక్తులు
హర్​ కీ పౌడీ ఘాట్​ వద్ద భక్తులు

సాధారణంగా మూడు నెలలపాటు జరిగే కుంభమేళాను చరిత్రలో తొలిసారిగా నెలరోజులు మాత్రమే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అక్కడికి వెళ్లే భక్తులకు కొవిడ్​ టెస్ట్​లు తప్పనిసరి చేసింది. నెగెటివ్ రిపోర్టు ఉన్న వారికి మాత్రమే అనుమతి కల్పిస్తోంది.

ప్రారంభోత్సవం సందర్భంగా..
గంగానదిలో స్నానమాచరిస్తూ..

ఇదీ చదవండి:ఆ చట్టానికి పాతికేళ్లైనా.. అట్టడుగునే ఆదివాసులు!

ABOUT THE AUTHOR

...view details