UPSC Recruitment 2023 : యూపీఎస్సీ.. 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024' నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో.. కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 56
ఖాళీల వివరాలు..
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.
- జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 34 పోస్టులు
- జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 1 పోస్టు
- కెమిస్ట్, గ్రూప్-ఏ: 13 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.
- సైంటిస్ట్ 'బి'(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 04 పోస్టులు
- సైంటిస్ట్ 'బి'(కెమికల్), గ్రూప్-ఎ: 02 పోస్టు
- సైంటిస్ట్ 'బి'(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు
విద్యార్హతలు..
మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్ప్లోరేషన్/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)-అప్లైడ్ జియోఫిజిక్స్ చదివి ఉండాలి.
వయోపరిమితి..
2024 జనవరి 1 నాటికి 21-32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
దరఖాస్తు రుసుము..
జనరల్ అభ్యర్థులకు రూ.200.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక, పరీక్ష విధానం..
స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.