ఉత్తర్ప్రదేశ్లో మరో పాశవిక ఘటన వెలుగుచూసింది. మోన్పురి జల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
ఓ పోలీసు అధికారి తన మిత్రుడు.. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మహిళను అత్యాచారం చేశారు. ముందు ఇరువురూ కలిసి యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిని వదిలేసి పరారయ్యారు.