తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాశీలో ట్రాన్స్​జెండర్ల కోసం ప్రత్యేక​ శౌచాలయాలు - ఉత్తర్​ప్రదేశ్​

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో తొలిసారిగా ట్రాన్స్​జెండర్ల కోసం శౌచాలయాలను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

transgender, toilet
ఉత్తర్​ప్రదేశ్​లో తొలి ట్రాన్స్​జెండర్​ శౌచాలయం ప్రారంభం

By

Published : Feb 17, 2021, 2:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్​జెండర్ల కోసం శౌచాలయాలు ఏర్పాటు చేశారు. వారణాసి నగర పాలక సంస్థ వీటిని మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. వచ్చే మూడు నాలుగు నెలల్లో మరిన్ని శౌచాలయాలు నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

" ఇప్పటివరకు మహిళలకు, పురుషులకు మాత్రమే శౌచాలయాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్​జెండర్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా వీటిని నిర్మించాము. రెండు మూడు నెలల్లో నగరంలో మరో నాలుగు శౌచాలయాలాను అందుబాటులోకి తెస్తాము."

-గోరంగ్​ రాఠీ, వారణాసి నగర కమిషనర్

మాకు తగిన శౌచాలయాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం ఈ శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి నగరంలోనూ ఇలాంటివి అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

-రోషిణి, ట్రాన్స్​జెండర్

"ఈ తరహా శౌచాలయాలు ఉత్తర్​ప్రదేశ్​లోనే తొలిసారిగా నిర్మించాము. ఈ శౌచాలయాలను మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. కాబట్టి ట్రాన్స్​జెండర్లకు ఇకపై ఎలాంటి ఇబ్బంది కలగదు. మహిళలు, పురుషులు ఈ శౌచాలయాలు వినియోగించడం నిషేధం."

-మృదుల జయశ్వాల్, వారణాసి నగర మేయర్

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అవడం వల్లే వారణాసిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిషనర్​ పేర్కొన్నారు. ప్రధాని ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.

ఇదీ చదవండి :కశ్మీర్​లో విదేశీ రాయబారుల పర్యటన

ABOUT THE AUTHOR

...view details