UP assembly election 2022: ఉత్తర్ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతలో పూర్వాంచల్లోని 54 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగింది. చందౌలీ నియోజకవర్గంలోని చకియా, సోన్భద్రలోని రాబర్ట్స్గంజ్, దుద్ది ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
UP election final phase:
ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలోనూ ఈ విడతలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం 2.06 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు.