వరుడు పేరు కొల్హు కొత్త వస్త్రాలు కట్టుకుని టోపీ పెట్టుకుని రాగా.. వధువు వాసంతి కొత్త బట్టలతో పెళ్లి పందిట్లోకి విచ్చేసింది. వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లిపందిరి కింద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డించారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ పెళ్లి జరిగింది మనుషులకు కాదండి బాబు! ఓ రెండు పెంపుడు కుక్కలకు. మరి ఆ కథేంటో మీరూ తెలుసుకోండి.
బిహార్ తూర్పు చంపారణ్లోని మోతిహరిలో ఓ అరుదైన వివాహం జరిగింది. మజుర్హాన్ గ్రామానికి చెందిన నరేశ్ సాహ్నీ, సవిత దేవి దంపతులు వారు పెంచుకుంటున్న కుక్కలకు ఘనంగా వివాహం చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహానికి పందిరి వేసి అంగరంగ వైభవంగా చేశారు. పండితులు వేదమంత్రాలు చదువుతుండగా.. సహాయకులతో కలిసి వేడుకను నిర్వహించారు.