తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో కేంద్ర మంత్రి కాన్వాయ్​పై దాడి - కేంద్ర మంత్రి కారుపై దాడి

కేంద్ర మంత్రి మురళీధరన్​ కాన్వాయ్​పై బంగాల్​లో దాడి జరిగింది. 'టీఎంసీ గూండాలే' ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. తృణమూల్​ హింస మితిమీరిపోతోందని అన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.

Union Minister V Muraleedharan's car attacked by locals in Panchkhudi, West Midnapore
బంగాల్​లో కేంద్ర మంత్రి కాన్వాయ్​పై దాడి

By

Published : May 6, 2021, 2:02 PM IST

Updated : May 6, 2021, 4:28 PM IST

కేంద్ర మంత్రి కాన్వాయ్​పై రాళ్లు, కర్రలతో దాడి

బంగాల్​లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కారుపై దాడి జరిగింది. పశ్చిమ మిడ్నాపుర్​లోని పంచకుడిలో స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తన పర్యటనను వాయిదా వేసుకున్నారు మురళీధరన్.

ధ్వంసమైన కారు అద్దాలు
కారులో కర్రలు

టీఎంసీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని మురళీధరన్ ఆరోపించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కానీ డ్రైవర్​కు గాయాలయ్యాయని స్పష్టం చేశారు.

'టీఎంసీ గూడాలు నా కాన్వాయ్​పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు. నా పర్యటనను కుదించుకుంటున్నా' అంటూ మంత్రి ట్వీట్ చేశారు.

కారు అద్దాలు ధ్వంసం

పరామర్శించేందుకు వెళ్తే..

బంగాల్​ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలోనే దాడి జరిగిందని పేర్కొన్నారు మురళీధరన్. ఒక్కసారిగా చాలా మంది మీదికి దూసుకొచ్చారని చెప్పారు.

మంత్రి వాహనశ్రేణిపై జరిగిన దాడిపై విచారణ జరపనున్నట్లు.. స్థానిక కొత్వాలీ పోలీస్​ స్టేషన్​ అధికారి తెలిపారు.

మంత్రి కాన్వాయ్​పైనే దాడి అంటే?

ఒక మంత్రి కాన్వాయ్​పైనే దాడి జరిగిందంటే.. బంగాల్​లో మరి ఎవరు సురక్షితంగా ఉన్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. దాడి వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ఆరోపించారు.

''మంత్రి కాన్వాయ్​పైనే దాడి జరిగిందంటే.. రాష్ట్రంలో ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఇది రాష్ట్ర ప్రాయోజిత హింస. బంగాల్​లో హింసను మేం ఖండిస్తున్నాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.''

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి

మురళీధరన్​పై దాడిని ఖండించిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. తృణమూల్​ కాంగ్రెస్​ హింస మితిమీరిపోతోందని అన్నారు.

ఇదీ చదవండి:బంగాల్ హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు

Last Updated : May 6, 2021, 4:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details