తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమర జవాన్లకు అమిత్​ షా నివాళి - జవాన్లకు నివాళి అర్పించిన అమిత్​ షా

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఛత్తీస్​గఢ్​లోని జగ్​దల్​పుర్​లో పుష్ప గుచ్ఛాలతో షా శ్రద్ధాంజలి ఘటించారు. ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel
వీర జవాన్లకు నివాళి అర్పించిన అమిత్ షా

By

Published : Apr 5, 2021, 11:56 AM IST

ఛత్తీస్​గఢ్​ బస్తర్​ అడవుల్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో.. వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్​షా. ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్​లో జవాన్లకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీర జవాన్లకు అమిత్​ షా నివాళి
జవాన్లకు నివాళి అర్పిస్తున్న అమిత్​ షా, చిత్రంలో ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్​
జవాన్ల మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచుతున్న షా
జవాన్ల మృతదేహాలకు గౌరవ వందనం చేస్తున్న అమిత్​ షా
జవాన్​ల మృతదేహాలు

బీజాపుర్​- సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30మందికిపైగా సైనికులు గాయాలపాలయ్యారు.

ఇదీ చదవండి :సీఆర్​పీఎఫ్​ అమర జవాన్లకు 'సైకత' నివాళి

ABOUT THE AUTHOR

...view details