మే 1 నుంచి కరోనా టీకాల ధరలను కొవిన్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతామని కేంద్రం వెల్లడించింది. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు.. టీకాను ఎంచుకునే సౌలభ్యం ఉంటుదని తెలిపింది.
18-44 ఏళ్ల వయసు వారికి ఏప్రిల్ 28 నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్న ప్రైవేటు సెంటర్లన్నీ.. కరోనా టీకా రకం, వాటి నిల్వలు, కేంద్రం నిర్ణయించిన ప్రకారం వాటి ధరను కొవిన్ పోర్టల్లో తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. ఈ వివరాలను జత చేసేందుకు పోర్టల్లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.
"కొవిన్ మాడ్యూల్లో టీకా ధర, రకం వంటి వివరాలను పొందుపరుస్తాం. తద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సమయంలో పౌరులు తమ టీకాను ఎంపిక చేసుకోవచ్చు"