తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2021, 12:19 PM IST

Updated : Mar 2, 2021, 2:14 PM IST

ETV Bharat / bharat

జోరుగా వ్యాక్సినేషన్- టీకా తీసుకున్న మంత్రులు

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు వ్యాక్సిన్​ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఆయన​ సతీమణి నేడు కొవిడ్​ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. మరో కేంద్ర మంత్రి రవిశంకర్​ కూడా ఈరోజు టీకా డోసు వేయించుకున్నారు.

Union Health Minister
జోరుగా వ్యాక్సినేషన్ 2.0- టీకా తీసుకున్న ఆరోగ్య మంత్రి

కరోనా రహిత భారత్​ కోసం కేంద్రం తలపెట్టిన వ్యాక్సినేషన్​ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ.. కొవాగ్జిన్​ టీకా వేసుకున్న అనంతరం పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

టీకా తీసుకున్నకేంద్ర ఆరోగ్య మంత్రి
టీకా తీసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రి భార్య
టీకా వేయించుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
వ్యాక్సిన్​ తీసుకున్న కేంద్రమంత్రి నఖ్వీ
టీకా డోసు వేయించుకున్న ఫరూక్​ అబ్దుల్లా

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​, ఆయన భార్య.. దిల్లీ హార్ట్​ అండ్​ లంగ్​ ఇన్​స్టిట్యూట్​లో నేడు కొవిడ్​ వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ.. ఉత్తర్​ప్రదేశ్​ రాంపుర్​లో​ వ్యాక్సిన్​ తీసుకున్నారు. మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. పట్నా ఎయిమ్స్​లో వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. నేషనల్​ కాన్ఫెరెన్స్​ ఎంపీ ఫరూక్​ అబ్దుల్లా.. శ్రీనగర్​లోని ఆసుపత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు.

Last Updated : Mar 2, 2021, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details