తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 8:22 PM IST

Updated : May 12, 2021, 8:30 PM IST

ETV Bharat / bharat

పెద్ద కొడుకు చితి ఆరకముందే చిన్న కుమారుడు మృతి

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ అనేక హృదయ విదారక ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాకు సమీపంలోని ఓ గ్రామంలో.. పెద్ద కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించి వచ్చిన ఒక తండ్రికి.. చిన్న కుమారుడు సైతం కరోనాతో మరణించడం చూసి శోక సంద్రంలో మునిగిపోయాడు.

two-young-sons-of-a-family-died-of-corona-in-jalalpur-village-of-noida
ఒకేరోజు ఇద్దరు కొడుకుల మృతి.. తండ్రి అంత్యక్రియలు

నగరాల నుంచి గ్రామాలకు శరవేగంగా విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి కాటుకు అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాకు సమీపంలోని జలాల్‌పూర్ గ్రామంలో కరోనాతో చనిపోయిన పెద్ద కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ తండ్రి. శ్మశానవాటిక నుంచి తిరిగి వచ్చిన అతనికి .. చిన్న కుమారుడు సైతం మరణించాడన్న పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయాడు. ఒకే రోజు.. ఇద్దరు కుమారుల మరణంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం బంధువులు, గ్రామస్థుల వల్ల కాలేదు.

గ్రామంలో భయం..

తమ గ్రామంలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయని.. గత 10 రోజుల్లో 18 మంది చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో ఆసుపత్రి లేనందు వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:చనిపోయిన తర్వాత కొవిడ్ మృతదేహానికి ఆక్సిజన్

అంత్యక్రియలకు తోపుడుబండిపైనే తల్లి మృతదేహం

Last Updated : May 12, 2021, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details