తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వీట్లు, కానుకలతో పీఓకే బాలికల అప్పగింత - పాక్ బాలికలను తిరిగి అప్పగించిన అధికారులు

ఆదివారం తెల్లవారుజామున భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్ బాలికలను పొరుగు దేశ అధికారులకు అప్పగించారు భారత అధికారులు. బాలికలకు స్వీట్లతో పాటు పలు కానుకలు ఇచ్చారు.

Two stranded minor girls from PoK repatriated
స్వీట్లు, బహుమతులతో పీఓకే బాలికల అప్పగింత

By

Published : Dec 7, 2020, 5:35 PM IST

పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ బాలికలను తిరిగి తమ స్వస్థలాలకు పంపించారు అధికారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన అధికారులకు చకన్ దా బాగ్​ క్రాసింగ్ పాయింట్ వద్ద ఇద్దరు బాలికలను అప్పగించారు. వారికి మిఠాయిలు, పలు కానుకలు ఇచ్చారు భారత అధికారులు.

బాలికలను అప్పగిస్తున్న భారత అధికారులు

భారత అధికారులు తమను బాగా చూసుకున్నారని బాలికలు తెలిపారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారని చెప్పుకొచ్చారు.

"మేం దారి తప్పిపోయి భారత భూభాగంలోకి వచ్చేశాం. ఆర్మీ సిబ్బంది మమ్మల్ని కొడతారని భయపడ్డాం. కానీ వారు బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఇంటికి పంపించరేమోనని అనుకున్నాం.. కానీ ఇవాళే పంపించేశారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు."

-లైబా జబైర్, పీఓకే బాలిక

ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన భారత భద్రతా దళాలు.. బాలికలను గుర్తించి అడ్డుకున్నాయి. వీరిని స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఆ బాలికలను పీఓకే ఫార్వర్డ్​ కహుటా తహసీల్​లోని​ అబ్బాస్​పుర్​కు చెందిన లైబా జబైర్​(17), సనా జబైర్​ (13)గా గుర్తించారు.

ఇలాంటి ఘటనలు నియంత్రణ రేఖ వెంబడి తరచుగా జరుగుతుంటాయి. సరిహద్దులో కాల్పుల వల్ల భయపడి స్థానిక ప్రజలు ఒక్కోసారి నియంత్రణ రేఖ దాటుతుంటారు. సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టిన తర్వాత దేశంలోకి ప్రవేశించినవారిని తిరిగి అప్పగించేస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details