తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నతండ్రినే కడతేర్చిన కుమారులు.. శవాన్ని సరస్సులో పడేసి.. - ఝార్ఖండ్​లో కూతుర్ని హత్య చేసిన తండ్రి

Two Sons Murdered Father: కన్నతండ్రినే(62) ఇద్దరు కుమారులు కలిసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దాల్ సరస్సులో పడేసి ప్రమాదంగా మార్చేందుకు కుట్ర పన్నారు. ఝార్ఖండ్​లో జరిగిన మరో ఘటనలో సొంత బిడ్డనే(6) హత్య చేశాడు ఓ తండ్రి.

Two sons arrested for murdering father in Kashmir
హత్య

By

Published : Apr 9, 2022, 8:56 PM IST

Two Sons Murdered Father: కశ్మీర్​లో అమానవీయ ఘటన జరిగింది. కన్నతండ్రినే(62) ఇద్దరు కుమారులు కలిసి హత్య చేశారు. అనంతరం దీన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని దాల్ సరస్సులో పడేశారు. అయితే.. ఏప్రిల్ 7న వృద్ధుడి మృతదేహం దాల్ సరస్సులో తేలియాడుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు శ్రీనగర్ నివాసి కుర్షిద్​ అహ్మద్​ తోటా(62)గా గుర్తించి పోస్టుమార్టానికి పంపారు.

రిపోర్టుల్లో కుర్షిద్ హత్యకు గురయ్యాడని తేలింది. మెడపై గాట్లు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్య చేశారని ప్రాథమిక దర్యాప్తులో భావించారు. కానీ సీసీటీవీ ఆధారాలతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితున్ని సొంత కొడుకులే హత్య చేశారని పోలీసులు కనిపెట్టారు. హత్యను ప్రమాదంగా చిత్రించడానికి మృతదేహాన్ని ఒక రోజు ఇంట్లో ఉంచి, అనంతరం దాల్ సరస్సులో పడేశారని వివరించారు.

నరికి చంపి:కేరళ కొల్లాం జిల్లాలో దారుణం జరిగింది. కొక్కడ్ శివ దేవాలయం ఉత్సవాల్లో ఓ యువకున్ని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మెడపై నరికి, వేళ్లను శరీరం నుంచి వేరు చేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న మనోజ్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు మనోజ్.. చక్కువరక్కళ్​​ యూత్​ ఫ్రంట్​ అధ్యక్షునిగా పోలీసులు గుర్తించారు.

మనోజ్​ది రాజకీయ హత్య అని ఆరోపించారు ఎమ్మేల్యే కేబీ గణేష్ కుమార్. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని అన్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. చివరి క్షణంలో మనోజ్​.. నిందితుల వివరాలు చెప్పారని అతని సోదరుడు తెలిపారు. హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్షణికావేశంలో కూతురి హత్య:ఝార్ఖండ్ పలాము జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. సొంత బిడ్డనే(6) హత్య చేశాడు ఓ తండ్రి. అయితే.. కోయిల్ నది ఒడ్డున ఇసుకలో బాలిక మృతదేహం బయటపడింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. 'బాలిక తండ్రి ఆనంద్ కుమార్(28) ఇంటి సభ్యులతో గొడవపడి కూతుర్ని క్షణికావేశంలో గొంతునులుమి హత్య చేశాడు. అనంతరం 45 కిలోమీటర్లు ప్రయాణించి మేదినీనగర్​ పోలీసు స్టేషన్ పరిధిలోని కోయిల్ నది ఒడ్డున ఇసుకలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఏమీ తెలియనట్లు పంకీ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశాడు.' అని పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పబ్​పై అర్ధరాత్రి పోలీసుల దాడి.. అదుపులోకి 24 మంది యువతుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details