మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల లాల్పుర్ గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇరువర్గాల మధ్య దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగాయి.
వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతి - మధ్య ప్రదేశ్ మండ్లాలో ఎన్కౌంటర్
మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరో ప్రాంతంలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందారు.
మండ్లలో ఎన్కౌంటర్- ఇద్దరు మావోయిస్టులు మృతి
బాలాఘాట్లో..
అంతకుముందు బాలాఘాట్ జిల్లా కిర్నాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోర్వాన్ అటవీ ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. వారి నుంచి 12 రైఫిల్స్, ఇతర మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా మావోయిస్టులపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.