కర్ణాటక దొడ్డబల్లాపురలో విషాద ఘటన చోటుచేసుకుంది(karnataka accident news). 60మంది ప్రయాణికులున్న ఓ పెళ్లి బస్సు సుబ్రమణ్య ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడింది(karnataka bus accident news). ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 27మంది గాయపడ్డారు.
సుబ్రహ్మణ్య ఆలయంలో శనివారం వివాహ వేడుకలు జరిగాయి. గౌరిబిడనూర్ తాలుకాకు చెందిన ప్రజలు బస్సులో ఆ వివాహానికి తరలివెళ్లారు. తిరిగివస్తున్న క్రమంలో 10గంటల ప్రాంతంలో 30అడుగుల లోయలో పడిపోయింది.
ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులను మకాలి గ్రామానికి చెందిన శివకుమార్, బండిచిక్కనహల్లివాసి రామకృష్ణా రెడ్డిగా గుర్తించారు.