కేరళ నుంచి కశ్మీర్కు సైకిల్పై బయలుదేరారు ఇద్దరు యువకులు. అయితే వీరిద్దరు ఒక ప్రాంతానికి చెందినవారు కారు. అలా అని సన్నిహితులూ కారు. కానీ వారి ఆకాంక్ష మాత్రం ఒక్కటే. అదే.. సైకిల్పై కశ్మీర్కు ప్రయాణించడం.. దారిలో వివిధ ప్రాంతాలను సందర్శించడం. అనుకోకుండా వీరి దారులు కలిశాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఒక్కటైంది.
కొన్ని రోజుల క్రితం పాలక్కడ్ జిల్లా పట్టాంబి నుంచి శ్రీజిత్, ఓ వారం కిందట తిరువునంతపురం నుంచి జిబిన్ జార్జ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ఇద్దరూ అనుకోకుండా కొజికోడ్ వద్ద కలుసుకున్నారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అనంతరం గమ్యస్థానానికి కలిసే చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో భారత్లోని వివిధ ప్రదేశాలను సందర్శించి, ప్రజలను కలుసుకోవాలని వారు భావిస్తున్నారు.