తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2021, 11:21 AM IST

ETV Bharat / bharat

వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాలో పులి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

tiger attack on people in pilibhit
వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాలో జరిగిన పులి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు దియోరియా గ్రామస్థులుగా అధికారులు గుర్తించారు. పులి దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదీ జరిగింది..

దియోరియా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. సమీపంలోని పూరన్​పుర్​ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో వారిపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.

పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి
బాధితులు ఉపయోగించిన వాహనం

దర్యాప్తు చేస్తుండగా..

పీలీభీత్​ టైగర్​ రిజర్వ్​లోని దియోరియా రేంజ్​లో వేటగాళ్లు ప్రవేశించినట్టు అధికారులకు ఆదివారం సమాచారం అందించింది. వేటగాళ్లను అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పులి దాడి జరిగినట్టు వెల్లడైందని అధికారులు వెల్లడించారు.

పులి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :Viral Video: గ్రామంలోకి చిరుతలు.. వణికిపోతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details