తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2021, 3:54 PM IST

ETV Bharat / bharat

ఒకరినొకరు కాల్చుకొని ఇద్దరు సీఆర్​పీఎఫ్ జవాన్లు మృతి

ఇద్దరు సీఆర్​పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

two-crpf-jawans-fired-at-each-other-in-chatra-jharkhand-both-died
ఒకరినొకరు కాల్చుకొని సీఆర్​పీఎఫ్ జవాన్లు మృతి

ఝార్ఖండ్​ ఛత్రాలోని సీఆర్​పీఎఫ్ బెటాలియన్​లో ఇద్దరు జవాన్లు ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్నారు. దీంతో ఇరువురూ అక్కడికక్కడే మరణించారు. సిమారియా ప్రాంతంలోని కొవిడ్ ఐసోలేషన్ భవనంలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జవాన్లు ఎందుకు కాల్పులు చేసుకున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రిషభ్ ఝా సహా సీఆర్​పీఎఫ్ ఉన్నతాధికారులు సిమారియాకు బయల్దేరారు.

ABOUT THE AUTHOR

...view details