తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్మగ్లర్ల కాల్పులు- ఇద్దరు పోలీసులు మృతి! - స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్​ మృతి

మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేసే ఇద్దరు దుండగులు.. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని భీల్వాడా జిల్లాలో జరిగింది.

స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్​ మృతి
two canistables shot dead in smugglers firing

By

Published : Apr 11, 2021, 11:22 AM IST

మత్తుపదార్థాలు​ అక్రమ రవాణా చేసే ముఠా దుశ్చర్యకు పాల్పడింది. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులపై ముఠాలోని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. రాజస్థాన్​లోని భీల్వాడా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాలోని కోట్​డీ, రైకా పోలీసు స్టేషన్​ పరిధిలో శనివారం రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్నారు సిబ్బంది. ఈ క్రమంలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న స్మగ్లర్లు కాల్పులకు పాల్పడ్డారు.

"స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్​ మరణించారు. గాయపడ్డ కానిస్టేబుల్స్​ ఓంకార్​ రైకా, పవన్​ చౌధరీలుగా గుర్తించాం. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం."

-వికాస్​ శర్మ, జిల్లా ఎస్పీ

ఇదీ చదవండి:విమానం టాయిలెట్​లో 1.36 కిలోల బంగారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details