తెలంగాణ

telangana

'టమాటాలకు బౌన్సర్ల' ఘటనలో ట్విస్ట్​.. వ్యాపారిపై కేసు నమోదు.. పరారీలో ఎస్​పీ నేత

By

Published : Jul 12, 2023, 10:16 AM IST

టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టి వార్తల్లో నిలిచిన వ్యక్తిపై కేసు నమోదైంది. సమాజ్​వాదీ పార్టీ నేత వినూత్న నిరసన చేపట్టాలనే ఉద్దేశంతో ఇలా చేయడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Etv Bharat
Etv Bharat

టమాటాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అనేక మంది నేతలు వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్​ప్రదేశ్​ వారాణాసికి చెందిన సమాజ్​వాదీ పార్టీకి చెందిన నాయకుడు.. ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకుని టమాటాలను అమ్మి వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసింది ప్రభుత్వం.

ఇదీ జరిగింది
Tomato Seller With Bouncer : టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టి విక్రయించాడు ఓ వ్యక్తి. కనీసం ఎవరినీ ముట్టుకోనియకుండా అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీనిని గమనించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా ఇదంతా నిరసనలో భాగమని తేలింది. టమాటాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినూత్న నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు సమాజ్​వాదీ పార్టీ నాయుకుడు అజయ్​. ఇందుకోసం లంక పోలీస్ స్టేషన్​ పరిధిలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న రాజ్​నారాయణ్​, అతడి కుమారుడు వికాస్​ను సంప్రదించాడు. వారి కూరగాయల దుకాణంలో కూర్చుని టమాటాల వద్ద ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని నిరసన చేపట్టాడు. ఇది ప్రభుత్వానికి తెలియడం వల్ల తాజాగా ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాజ్​నారాయణ్​, అతడి కుమారుడు వికాస్​ను అదుపులోకి తీసుకోగా.. ఎస్​పీ నాయకుడు అజయ్​ యాదవ్​ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని డీసీపీ ఆర్​ఎస్​ గౌతమ్ తెలిపారు.

మండిపడ్డ అఖిలేశ్ యాదవ్​
దీనిపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన కూరగాయల వ్యాపారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యకరమైన వ్యంగ్యానికి ఈ దేశంలో చోటు లేదని.. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణమన్నారు.

Tomato Rate India : అంతకుముందు టమాటాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు ప్రజలు దొంగలిస్తున్నారని.. అందుకే బాడీగార్డులను పెట్టుకున్నానని వ్యాపారి అజయ్​ యాదవ్ వీడియోలో​ చెప్పాడు. ఇప్పుడు ఉన్న అన్ని కూరగాయల్లో టమాటా ధర బాగా పెరిగిపోయిందని.. ప్రజలు రేటు తగ్గించమని అడుగుతున్నారని అజయ్​ అన్నాడు. కానీ తనకు వచ్చే లాభం బట్టే అమ్ముతున్నానని తెలిపాడు. "టమాటాలను కొనేందుకు వచ్చిన వారు.. కొందరు ధర తగ్గించమని గొడవ పెట్టుకుంటున్నారు. మరికొందరు టమాటాలను దొంగతనం చేస్తున్నారు. అందుకే బౌన్సర్‌లను పెట్టుకున్నాను. ప్రస్తుతం కిలో టమాటా రూ. 160కు అమ్ముతున్నాను. ప్రజలు కేవలం 50 లేదా 100 గ్రాముల టమాటాలే కొంటున్నారు"అని అజయ్​ యాదవ్​ చెప్పారు.

టమాటాలకు బౌన్సర్లు

ఖరీదు అని చెప్పి ముట్టుకోనివ్వడం లేదు..
Tomato Price In India : "టమాటాలు చాలా ఖరీదు అని చెప్పి ముట్టుకోనివ్వడం లేదు. 250 గ్రాముల టమాటాలను రూ. 35 పెట్టి కొన్నాను. కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు తక్కువ టమాటాలతో ఏం చేయగలం? కానీ తప్పదు" అంటూ కొనుగోలుదారుడు విజయ్ కుమార్ యాదవ్ వాపోయాడు.

ఇవీ చదవండి :టమాటాలకు కెమెరాతో భద్రత.. చోరీ భయంతో వ్యాపారి జాగ్రత్తలు

ABOUT THE AUTHOR

...view details