తమిళనాడులో వ్యక్తుల పేర్లు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తాము గౌరవించే వ్యక్తులు, సిద్ధాంతాల ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలకు పేర్లు పెడతారు. ఇది కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. పలువురు తమ పిల్లలకు స్వాతంత్య్రయోధుల పేర్లు పెట్టగా, ఇంకొంత మంది కమ్యూనిస్ట్ నాయకుల స్ఫూర్తితో వారి పేర్లను పెడుతుంటారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో వివిధ నేతలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ పేర్లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఒక స్టాలిన్, ఇద్దరు గాంధీలు..
దివంగత నేత కరుణానిధి నాటి సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ పేరును ఆయన కుమారుడికి పెట్టారు. ఆయనే ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్. ప్రస్తుతం స్టాలిన్ కేబినెట్లో ఓ గాంధీ, ఓ నెహ్రూ ఉన్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రిగా ఆర్ గాంధీ, పురపాలక శాఖ మంత్రిగా కేఎన్ నెహ్రూలు బాధ్యతలు చేపట్టారు.