తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీ నేత హత్యతో బంగాల్​లో ఉద్రిక్తత - Shalimar Railway Station crime

టీఎంసీ నేత ధర్మేంద్ర సింగ్​పై దుండగులు బైక్​ మీద వచ్చి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు. హౌడాలోని షాలిమార్​ రైల్వే స్టేషన్​ వద్ద జరిగిన ఈ ఘటనలో ధర్మేంద్ర మరణించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు రోడ్డు మీదకు వచ్చి వాహనాలకు నిప్పంటించారు. దుకాణాలను దోచుకున్నారు.

TMC leader shot dead in West Bengal
టీఎంసీ నేత దారుణ హత్యతో బంగాల్​లో ఉద్రిక్తత

By

Published : Dec 30, 2020, 5:43 AM IST

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ నేత ధర్మేంద్ర సింగ్​ హత్య కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం.. హౌడాలోని షాలిమార్​ రైల్వే స్టేషన్​ సమీపంలో కొందరు దుండగులు బైక్​ మీద వచ్చి ధర్మేంద్రపై కాల్చులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ధర్మేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధరించారు.

ధర్మేంద్ర సింగ్​

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పాత కక్షలతోనే ధర్మేంద్రను దుండగులు కాల్చిచంపినట్టు తెలుస్తోంది.

ధర్మేంద్ర పురపాలక ఎన్నికల్లో విజయం సాధించారు. హౌడా మున్సిపల్​ కార్పొరేషన్​లోని 39వ వార్డ్​లో టీఎంసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు.

విధ్వంసం..

టీఎంసీ నేత హత్య జరిగిన కొద్ది గంటల అనంతరం హౌడా ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అనేక మంది రోడ్డు మీదకు వచ్చి దుకాణాలను దోచుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

టీఎంసీ నేత దారుణ హత్యతో బంగాల్​లో ఉద్రిక్తత
వాహనానికి నిప్పు
హౌడాలో ఉద్రిక్తత
వస్తువులు దగ్ధం

ఇదీ చూడండి:-బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

ABOUT THE AUTHOR

...view details